డ్రైనేజీ నిర్మాణ పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్థిక ప్రవీణ్ గౌడ్

 రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం, జులై   (జనంసాక్షి):- ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి కొంగరకలాన్ లో జరుగుతున్న అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపాలిటీ    ఏఇ వీరాంజనేయులు తో పాటు  పరిశీలించిన ఆదిభట్ల మున్సిపల్ చైర్ పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాదాపు అండర్ డ్రైనేజీ పనులు పూర్తికవస్తున్నాయని, కొంగరకలాన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి కొంగర తండా వరకు 24 ఫీట్ల రోడ్డు వేయడం జరుగుతుందని ఈ పనులు కూడా తొందరలోనే ప్రారంభించాలని కాంట్రాక్టర్ కోరడం జరిగింది. అదేవిధంగా   ఆదిభట్ల బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని (ఆర్ అండ్ బి)  ఏఇ , డిఇ, లతో చరవాణి లో మాట్లాడి  పనులు తొందరగా చేపించగలరాని కోరడం జరిగింది .ఈ కార్యక్రమంలో నర్స గళ్ల జంగయ్య, ముద్దo శంకర్, ఉడుగుల జనార్ధన్, నాయిని శ్రీనివాస్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.