ఢిల్లీని కప్పేసిన పొగమంచు

22

దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా ఉదయం ఏడు గంటల వరకు కూడా నగరంలోని రోడ్లపై 50 మీటర్ల దూరానికి మించి కనిపించలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం ఏడు గంటల తర్వాత మంచు తొలగిపోవడంతో వాహనాల రాకపోకలు సజావుగా సాగాయి.