ఢిల్లీని కమ్మేసిన పొగమంచు
దేశ రాజధాని నగరం ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. పొగ మంచు కారణంగా 81 రైళ్ల సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగ మంచు ప్రభావంతో 10 రైళ్లను రీషెడ్యూల్ చేయగా..ఐదు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. పొగమంచు ధాటికి ఐదు అంతర్జాతీయ విమానాలు, 8 దేశీయ విమానాలు ఆలస్యంగా రానున్నట్లు తెలిపారు. 2 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు.