ఢిల్లీలో కాల్పుల కలకలం

ఢిల్లీలోని ఓ మెట్రో స్టేషన్ దగ్గర కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అక్బర్ పై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అక్బర్ వెంట ఉన్న అనుచరుడు పరారీలో ఉన్నాడు. నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్ దగ్గర తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అక్బర్ పై 25వేల రివార్డు ఉంది.