ఢిల్లీలో గ్రీన్ ఫైర్ క్రాకర్స్
న్యూఢిల్లీ,నవంబర్1(జనంసాక్షి): ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్ ఫైర్ క్రాకర్స్ ను ప్రవేశ పెట్టినట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నా మన్నారు. అయితే, ఈసారి ఉన్న పరిస్థితుల్లో కాలుష్యం తగ్గే పరిస్థితి లేదని, అయినప్పటికీ అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రితో హర్షవర్ధన్ సవిూక్ష జరిపారు. సుప్రీం ఆదేవాల మేరకు పర్యావరణ పరిరక్షణ చేపట్టాలన్నారు.