ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..భారీగా ఆస్తి నష్టం
న్యూఢిల్లీ : నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓక్లా ఫేస్ వన్ ప్రాంతంలో టైర్ల ఫ్యాక్టరీ గోడౌన్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు 10 అగ్నిమాపక శకటాలు కృషి చేశాయి. దీపావళి సందర్భంగా కాల్చిన టపాసులే అగ్ని ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈఘటనలో భారీగా ఆస్తినష్టం సంభవించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.