ఢిల్లీలో మంత్రి కేటీఆర్ పర్యటన

000మంత్రి కేటీఆర్ ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా కేంద్ర మంత్రులతోపాటు పలువురు విదేశీ దౌత్యవేత్తలను కేటీఆర్ కలుసుకోనున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రాతో సమావేశం సందర్భంగా మూతపడిన పరిశ్రమలపై చర్చించనున్నారు. వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా కలిసి.. సులభ వాణిజ్య విధానంపై చర్చించనున్నారు. అటు జపాన్ రాయబారితో సమావేశం అనంతరం మలేషియా ఉప ప్రధానితో పాటు తైవాన్, కొరియన్ రాయబారులతో కేటీఆర్ భేటీ కానున్నారు. అటు ఢిల్లీలో జరిగే డబ్ల్యూఈఎఫ్ డిజిటల్ సమ్మిట్ కు కేటీఆర్ హాజరు కానున్నారు.