ఢిల్లీలో రక్షణ కరువైందన్న బెంగాల్‌ సీఎం మమత

ఢిల్లీ, జనంసాక్షి:  ఢిల్లీలో రక్షణ కరువైందని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల దాడికి గురైన మమత ఇవాళ చిదంబరంతో భేటీ రద్దు చేసుకుని ప్రత్యేక విమానంలో కోల్‌కతా బయల్దేరారు. మమత తోపాటు ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల దాడికి గురైన బెంగాల్‌ మంత్రి అమిత్‌మిత్రా ఇంకా ఆస్పత్రిలో  ఉన్నారని మమత తెలిపారు.