ఢిల్లీలో సీడబ్లూసీ భేటీ ప్రారంభం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8 : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. టెన్‌జన్‌పత్‌లోని సోనియా నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు, ప్రత్యేక ఆహ్వానితులుగా పలువురు హాజరయ్యారు. పార్టీ అధ్యక్ష పదవి కాలాన్ని మరో ఏడాదికి పొడిగించేందుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇవ్వనుంది. అలాగే బీహార్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చలు జరుపనున్నారు.