ఢిల్లీలో హై అలర్ట్

2

హోళీ సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశముందనే ఐబీ హెచ్చరికలతో దేశ రాజధానితో పాటూ పలు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దీంతో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వీవీఐపీల ఇంటి దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. అటు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలతో పాటూ విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో భద్రత పెంచారు.