ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడి సమయంలో మనోజ్  తివారీ ఇంట్లో లేరు. దీనికి సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తన ఇంటిపై జరిగిన దాడి వెనుక కుట్ర ఉందని మనోజ్ తివారీ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక పోలీసుల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.