ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్ లో తెలుగోళ్లకు నిరాశ

No-Place-AP-T- RDparade-v6ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్ కు సంబంధించి.. తెలుగు రాష్ట్రాలకు నిరాశ మిగిలింది. శకటాల ప్రదర్శనలో.. ఈ ఏడాది 23 ఎగ్జిబిట్స్ నే కేంద్ర రక్షణ శాఖ ఆమోదించింది. పరేడ్ లో 17 రాష్ట్రాలతో పాటు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన మరో 6.. మొత్తంగా 23 శకటాలకే అనుమతి దక్కింది. అసోం, గోవా, సిక్కిం, రాజస్థాన్, చండీగఢ్, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, యూపీ, జమ్మూకాశ్మీర్, గుజరాత్ రాష్ట్రాల శకటాలు పరేడ్ లో కనిపించనున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలు పోటీ పడి శకటాలు రూపొందించినా… ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రదర్శనకు రక్షణ శాఖ ఆమోదించకపోవడంతో.. అధికారులు నిరాశ చెందారు.