ఢిల్లీ హైకోర్టులో సుబ్రహ్మణ్యస్వామికి చుక్కెదురు
న్యూఢిల్లీ,ఆగస్టు30 : బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై కోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను సమర్పించాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశించింది. ఈ కేసు విచారణకు సంబంధించి ఏవైనా కొత్త విషయాలు ఉంటే రెండు వారాల్లోగా సమర్పించాలని ఆదేశించింది. ఆలోగా సమర్పించకపోతే ఈ కేసు విషయాన్ని తామే చూసుకుంటామని స్పష్టం చేసింది. ఈ కేసులో వాదనలు వినిపించిన సుబ్రహ్మణ్యస్వామి విషం వల్ల సునందపుష్కర్ మరణించిందని దర్యాప్తు సంస్థలు నిర్దారిస్తే ఇంకా అది ఏ తరహా విషమో విశ్లేషించడంలో ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. అమెరికా ఎఫ్బీఐ, ఇతర ఏజెన్సీలతోఫోరెన్సిక్ దర్యాప్తును విశ్లేషించడం కేసు దర్యాప్తులో జాప్యం చేయడమేనని చెప్పారు.