ఢీల్లీలో సీఎం రహస్య మంతనాలు

న్యూఢీల్లీ, జనంసాక్షి: ఢీల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనూహ్యంగా రెండు గంటల పాటు మాయం అయ్యారు. సెక్యూరిటీ లేకుండా ఓ ప్రైవేట్‌ వాహనంలో ఆయన బయటకు వెళ్లారు.. ఏపీ భవన్‌లో ఉన్న ముఖ్యమంత్రి సెక్యూరిటి సిబ్బందికి కనీస సమాచారం లేకుండా బయటకు వెళ్లారు. ముఖ్యమంత్రి ఎక్కుడకు వెళ్లారు, ఎవర్ని కలిశారనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.