తగ్గుతూ వస్తోన్న పెట్రో ధరలు

న్యూఢిల్లీ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): పెట్రోల్‌, డీజిల్‌ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలను బట్టి శుక్రవారం కూడా పెట్రో ఉత్పత్తుల ధరల్లో స్వల్ప మార్పులు చేశారు. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ పై 19 పైసలు, డీజిల్‌ పై 14 పైసలు తగ్గాయి. ఢిల్లీతో పాటూ అన్ని నగరాల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గాయి. గత నెలలో వరుసగా 20 రోజుల పాటూ పెరిగిన ధరలు.. వినియోగదారులను బెంబేలెత్తించాయి. దీంతో వ్యాట్‌ ను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అంతర్జాతీయ పరిణామాలు కాస్త మారడంతో.. చమురు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి.