తడి లేదు… పొడి లేదు..!
*అలంకారాప్రాయగా సెగ్రిగేషన్ షెడ్లు,
*పంచాయతీ లో తయారి కాని సేంద్రియ ఎరువు,
* సేకరిస్తున్న తడి పొడి చెత్త వృధా,
* ప్రభుత్వ లక్ష్యం పక్కదారి,
* లక్షల్లో ప్రజాధనం వృధా,
*పట్టించుకోని అధికార యంత్రాంగం,
ఖానాపురం అక్టోబర్15 జనం సాక్షి
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సేంద్రియ ఎరువు తయారీ పక్కదారి పడుతుంది. సేంద్రియ
ఎరువుల తయారీకిసెగ్రిగేషన్ షెడ్లు, నిర్మాణాలు పూర్తయ్యేంతవరకు హడావుడి చేసిన అధికార యంత్రాంగం పూర్తి అయిన తర్వాత వాటి సంగతి మర్చిపోయారు.సెగ్రిగేషన్ షెడ్లులో సేంద్రియ ఎరువు తయారు చేయాలి అని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ పంచాయతీ పాలకవర్గం పట్టించుకోవడం లేదు.ఫలితంగా లక్షలు వెచ్చించి నిర్మించినసెగ్రిగేషన్ షెడ్లు
వృధాగా ఉంటున్నాయి. ఉన్నతాధికారులు సైతం అటువైపు దృష్టి సారించకపోవడం తో అసలు లక్ష్యం నెరవేరడం లేదు చెత్త వేరు చేయడం, సేంద్రియ ఎరువు తయారు చేయ డం కోసం గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్లు నిరుపయోగంగా మారాయి. మండలం లో ని 20పంచాయతీల్లో సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించారు. ఒక్కో షెడ్ నిర్మాణానికి రూ. 2.50 లక్షలు ఖర్చు చేశారు. ఈ షెడ్లలో పొడి చెత్తలో వచ్చిన ప్లాస్టిక్ సంచులు, బాటిల్స్, చెప్పులు, బ్యాగులు, అట్టముక్కలు, దుస్తులు, మెటల్స్ వంటి వాటిని వేరు చేసి నిల్వ ఉంచడానికి ఏర్పాట్లు చేశారు. తడి చెత్త అయిన కూరగాయలు, ఆకుకూరల వ్యర్థాలు, కుళ్లిన మెతుకులు, పండ్లు వంటివాటి ద్వారా ఎరువుల తయారీకి ప్రత్యేక నిర్మాణాలు చేశారు. చెత్త వేసేందుకు ఇంటింటికి తడి, పొడి చెత్త బుట్టలను అందించి, అవగాహన కల్పించారు. గ్రామ పారిశుఽధ్య కార్మికులు సెగ్రిగేషన్ షెడ్డు వద్ద తడి, పొడి చెత్తను వేరు చేసి, కేటాయించిన అరలలో వేయాలి. తడిచెత్తలో వానపాములను వదిలి, సేంద్రియ ఎరువులను తయారు చేయాలి. మిగతా సీసలు, ప్లాస్టిక్, ఇతర వస్తువులను విక్రయించాలి.
చెత్తను కాల్చేస్తున్న వైనం:
ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ట్రాక్టర్ల ద్వార తీసుకపోయి గ్రామ శివారులో కాలీ ప్రదేశాల్లో వద్ద బయట డంపు చేస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయకుండా కాల్చేస్తున్నారు. ఊరికి దగ్గర ఈ షెడ్లను ఏర్పాటు చేసిన చోట పొగతో చుట్టు పక్కల ప్రాంతాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుర్వాసన వస్తోందని వాపోతున్నారు. ఈ విషయంపై గ్రామస్థులు పలుమార్లు పంచా యితీ కార్యదర్శులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
పర్యవేక్షణ ఏదీ?:
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద తడి, పొడి చెత్తను వేరుచేసి సేంద్రియ ఎరువును తయారు చేయాలి. ఆ ఎరువును హరితహారం మొక్కలకు వేయడం తో పాటు, రైతులకు విక్రయించి పంచాయ తీలు ఆదాయాన్ని సమకూర్చు కోవాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇది నీరుగారు తోంది. చెత్త సేకరణ వరకే సక్రమంగా సాగుతుండగా, దానిని వేరు చేసి వ్యర్థాలను ఎరువుగా తయారు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. డంపింగ్ యార్డుల వద్ద చెత్త కాల్చివేతతో పొగ, దుర్వాసన వస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ ల ను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
Attachments area