తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన అజిత్‌

ముంబయి, జనంసాక్షి: ‘డ్యామ్‌లో నీళ్లు లేకపోతే మూత్ర విసర్జన చేసి నింపాలా’ అంటూ రైతులను ఉద్ధేశించి చేసిన వాఖ్యలకు మహరాస్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో క్షమాపణలు చెబుతున్నట్లు అజిత్‌ పరార్‌ తెలిపారు.