తపాలా బీమాతో ధీమా
రూ. 399 కే …10 లక్షల బీమా
మోత్కూరు అక్టోబర్ 17 జనంసాక్షి : భారత తపాలా శాఖ ప్రవేశపెట్టిన తపాలా ప్రమాద బీమా పథకం ఎన్నో కుటుంబాలకు దీమా కల్గిస్తుందని తపాలా అధికారి శివరాత్రి శివాజీ రాజ్ అన్నారు. మండలంలోని పొడిచేడు గ్రామంలో బీమా అవగాహన కార్యక్రమం లో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. రూ.399తో.. 10 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. అన్ని తపాలా కార్యాలయాల్లో ఇండి యన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ)ద్వారా పేమెంట్ చెల్లించి బీమా పొందవచ్చని తెలిపారు. 18-65 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ బీమా పథకానికి అర్హులని అన్నారు. ఈ పథకంలో చేరినవారు ప్రమాదం లో మృతిచెందినా, శాశ్వత అంగవైకల్యం సంభ వించిన రూ.10లక్షల బీమా వర్తిస్తుందని అన్నారు. అవుట్ పేషెంట్ కు రూ.30వేలు, ఇన్ పేషెంట్కు రూ.60వేలు, ఆస్పత్రి ఖర్చులు రోజుకు రూ.1000, పదిరోజుల వరకు రవాణా చార్జీలు రూ.25 వేలు, పాలసీదారు మరణిస్తే వారి ఇద్దరి పిల్లల చదువుల ఖర్చు రూ. లక్ష, మృ తిచెందిన పాలసీదారు అంత్యక్రియల కోసం రూ.5వేలు ఈ పథకం ద్వారా అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ పేలపూడి మధు మాట్లాడుతూ ఈ బీమా పథకాన్ని గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో పేలపూడి సత్యనారాయణ, దేందె మల్లేష్,యాదగిరి,పోతరబోయిన దేవయ్య,బండ లచ్చయ్య,మల్లయ్య,అంబటి సైదులు, బిపిఎం లు మల్లం రమేష్, ఎర్ర బిక్షం తదితరులు పాల్గొన్నారు.
Attachments area