…..తప్పుడు ప్రచారం చేయడం సరి కాదు
..వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 18: తమ కుమారులు చేసిన అప్పులు తీర్చడం కోసం నా కష్టార్జితమైన భూమిని మా ఇష్ట ప్రకారం అమ్మితే పెద్దమనుషులను అభాసుపాలు చేయడం సరికాదని మండల పరిధిలోని వెలువర్తి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు కేశబోయిన రాజయ్య జయమ్మలు అన్నారు. తమకున్న మూడు ఎకరాల భూమిలో పంట సాగు కోసం, వ్యవసాయ భూమి మరమ్మత్తు కోసం సుమారు పది లక్షల అప్పు చేయగా వాటిని తీర్చకుండా వృద్ధ దంపతులమైన తమని తమ కుమారులు వేధిస్తుండగా తమకున్న భూమిలో ఎకరం భూమిని అమ్మి పది లక్షల అప్పు తీర్చామని, దీనిపైన తమ కుమారులు గ్రామ పెద్దలు భూమి అమ్మాలని తమను ఒత్తిడి చేస్తున్నారని చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, మా జీవనాధారం కోసం అప్పు తీర్చడం కోసం భూమిని అమ్మామని వారన్నారు.
Attachments area