తప్పులు మానవసహజమే – రాహుల్‌

 

Gandhinagar: Congress Vice President Rahul Gandhi addresses a public meeting in Gandhinagar, Gujarat on Monday. PTI Photo (PTI10_23_2017_000149B)

న్యూఢిల్లీ,డిసెంబర్‌ 6,(జనంసాక్షి): నీకు కనీసం లెక్కలు కూడా రావా అంటూ బీజేపీతోపాటు నెటిజన్ల హేళనకు గురైన కాంగ్రెస్‌ కాబోయే అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ఇవాళ దీటుగా స్పందించారు. అన్ని విమర్శలకు ఒక్క ట్వీట్‌తో సమాధానం చెప్పేశారు. పనిలోపనిగా ప్రధాని మోదీకి, బీజేపీ నేతలకు సున్నితంగా చురకలంటించారు. నేను ఓ సాధారణ మనిషిని.. నరేంద్ర మోదీని కాదు.. మనిషులన్నాక ఇలాంటి తప్పులు చేయడం సహజం.. నా తప్పులు గుర్తించేలా చేసినందుకు థ్యాంక్స్‌ అంటూ రాహుల్‌ ఇవాళ ట్వీట్‌ చేశారు.