తమిళనాడులో కంటైనర్లలో తరలిస్తున్న రూ.765కోట్ల డబ్బు స్వాధీనం
తమిళనాడు : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కంటైనర్లలో తరలిస్తుండగా 765 కోట్ల రూపాయల డబ్బును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరికిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తిర్ పూర్ లో 3 కంటైనర్లలో భారీగా డబ్బును తీసుకు వెళుతుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న డబ్బు రూ. 570 కోట్లుగా ఎన్నికల అధికారులు గుర్తించారు. మరో సంఘటనలో కోయంబత్తూర్ దగ్గర రూ.195 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ డబ్బు ఎవరిదనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.