కూలిన ఆర్టీసీ డిపో గ్యారేజీ..8మంది మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పాత బస్ డిపో బిల్డింగ్ కూలి 8 మంది చనిపోయారు. 20 మందికి గాయాలయ్యాయి. నాసైపట్నం జిల్లా పొరయార్ లో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిలో నలుగురు డ్రైవర్లు, ముగ్గురు మెకానిక్ లు, ఓ కండక్టర్ ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న  మంత్రి మునియన్ సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు.