తమిళనాడులో పట్టాలు తప్పిన రైలు

qmbn22skచెన్నై ఎగ్మోర్-మంగళూరు ఎక్స్‌ ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. తమిళనాడులోని విరుధాచలం, తిరుంచి మధ్య కడలూరు దగ్గర 5 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 42 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 19 మంది మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వే అధికారులు, సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన బోగీలను మినహాయించి మిగిలిన రైలును అక్కడి నుంచి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి