తమిళనాడు ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటలు

 వరంగల్ : తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలులో బుధవారం వేకువజామున మంటలు చెలరేగాయి. దీంతో వరంగల్ జిల్లాలోని తాళ్లపూపపల్లి వద్ద రైలును కొద్దిసేపు నిలిపివేశారు. ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. రైలులో మంటలు చెలరేగడానికి షార్ట్సర్క్యూటే కారణమని అధికారులు వివరించారు. మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు.