తరుణ్‌ తేజ్‌పాల్‌పై అభియోగాల నమోదుకు ఆదేశం

పనాజి,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి):లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని గోవా కోర్టు గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలపై తరుణ్‌ తేజ్‌పాల్‌ న్యాయవాది మాట్లాడుతూ.. ఈ కేసు తుది ఛార్జ్‌షీటులో 376 సెక్షన్‌ లేదని అన్నారు.

కాగా తన వద్ద పనిచేసే మహిళా జర్నలిస్ట్ను తేజ్పాల్‌ లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గోవాలోని ఓఫైవ్‌ స్టార్‌ ¬టల్‌లో తేజ్‌పాల్‌ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సంస్థలోని మహిళా జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు అప్పట్లో దుమారం రేపాయి. ¬టల్‌లోని ఓ లిఫ్టులోకి లాగి తేజ్‌పాల్‌ తనను వేధించారంటూ బాధితురాలు తెహెల్కా మేనేజింగ్‌ ఎడిటర్‌ షోమా చౌధురీకి ఫిర్యాదు చేసింది.