తల్లి జన్మనిస్తుంది…గురువు జీవితాన్నిస్తాడు : మోదీ

న్pr5w5vssయూఢిల్లీ, సెప్టెంబర్ 4 : తల్లి జన్మనిస్తుంది…గురువు జీవితాన్నిస్తాడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం మానెక్‌షా ఆడిటోరియంలో ఏర్పాటు కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్పపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ స్మరణార్థం నాణెం విడుదల చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల వల్లే ఉపాధ్యాయులకు గుర్తింపు వస్తుందని తెలిపారు. విద్యార్థులు ఎక్కువ సమయం గురువులతోనే గడుపుతారని…మన మనసులపై గురువు ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు పదవీ విరమణ అన్నది లేదన్నారు. కలాం ప్రతిక్షణం కొత్త ప్రతిభను అన్వేషించేవారని గుర్తుచేశారు. తనను ఉపాధ్యాయుడిగా గుర్తుంచుకోవాలని అబ్దుల్‌కలాం భావించేవారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తదితరులు పాల్గొన్నారు.