తల్లి ప్రియుడే వారి పాలిట కాలయయుడిలామారాడు.

తల్లి పెట్టుకున్న వివాహేతర సంబంధం ఆ పిల్లల పాలిట శాపంగా మారింది. తల్లి ప్రియుడే వారి పాలిట కాలయయుడిలా మారాడు. ముగ్గురు పిల్లల్ని ఏమాత్రం కనికరం లేకుండా డ్రైనేజీ మ్యాన్ హోల్ తోసి చంపేశాడు. ఊపిరాడని ఆ పిల్లలు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ముగ్గురు పిల్లలు ఒకే రోజు  అదృశ్యం కావడంతో పోలీసులు కేసు వెంట పడ్డారు. చివరకు అసలు విషయాన్ని ఛేదించారు. బెంగళూరులో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
బెంగళూరు నగరం, పిల్లన్న తోటకు చెందిన నజీమా ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తోంది. ఆమె తన భర్త నుంచి ఆరు నెలల కిందట విడిపోయారు. ఆమెకు అలీ అబ్బాస్ బేగ్, హసనా బేగం, రహీం బేగ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఈమెకు ఫయ్యూమ్ బేగ్ అనే వ్యక్తితో పరిచయం, వివాహేతర సంబంధం ఏర్పడిపోయాయి. ఫయ్యూమ్ బేగ్ ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. అయితే ముగ్గురు పిల్లల తల్లిని పెళ్ళి చేసుకోవడం ఏంటి అతని కుటుంబ సభ్యులు వారించడంతో ఆగిపోయాడు.
ఈ క్రమంలో ఆగస్టు 27న నజీమా పిల్లలు కనిపించకుండా పోయారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పిల్లలు కనిపించకుండా పోవడం వెనుక తన భర్త ఇలియాస్ పాత్ర ఉంటుందేమోననే అనుమానం వ్యక్తం కావడంతో పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు ప్రారంభించారు. అతని పాత్ర లేదని తెలుసుకున్న తరువాత ఫయ్యూమ్‌ను విచారించారు. దీంతో పోలీసులే షాక్ తినే నిజాలు బయటకు వచ్చాయి. 
నజీమాను పెళ్లి చేసుకోవడానికి పిల్లలు అడ్డు ఉన్నారని భావించిన ఫయ్యూమ్ వారి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. దీంతో బనస్వాడీ స్కూల్‌లో ఉన్న పిల్లలను తీసుకువచ్చాడు. నగర శివార్లకు తీసుకెళ్లాడు. మాయమాటలు చెప్పి చిన్న పిల్లాడిని తొలత మ్యాన్ హోల్‌లో తోసేశాడు. పరుగులు తీస్తున్న ఇద్దరు పిల్లల్ని కూడా వెంబడించి పట్టుకుని మరీ మ్యాన్ హోల్‌లో తోసేశాడు. మ్యాన్ హోల్ లోపలికి దిగి వారు కొట్టుకుపోయారా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకున్న తరువాత అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. పోలీసుల పిల్లల శవాల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.