తాండూరు లో…వినాయక నిమర్జనానికి సహాకరించి ప్రతిఒక్కరి కృతజ్ఞతలు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి.

తాండూరు సెప్టెంబర్ 25(జనంసాక్షి)తాండూర్ పట్టణం లోజరిగిన వినాయక నిమర్జనంలో ఎలాంటి అవంచానియమైన సంఘటనలు జరగకుండా, ప్రశాంతమైన వాతావరణంలో జరుగుటకు సహకరించిన ఉత్సవ కమిటీ వారికీ, ప్రజాప్రతినిధులకు,వివిధ శాఖల అధికారులకు, తాండూర్ ప్రజలకు జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా క్రమశిక్షణతో అప్రమత్తం, ఓపికగా ఉంటూ వినాయకుల నిమజ్జనం పూర్తి అయ్యే వరకు విధులలో పాల్గొన్న జిల్లా అదనపు ఎస్పీ, డీటీసీ అదనపు ఎస్పీ,, డిఎస్పీ అధికారులకు, సీఐ, ఇన్స్పెక్టర్ అధికారులకు,ఆర్.ఐ అధికారులకు, ఎసై అధికారులకు, ఆర్.ఎసై అధికారులకు, కమ్యూనికేషన్ అధికారులకు,మహిళా అధికారులకు, పోలీస్ కాన్స్టేబుల్ అధికారులకు, హోం గార్డ్ అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వికారాబాద్ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున అభినందనలు తెలిపారు