తాగునీటి ఘర్షణలో తనయుడు మృతి: తట్టుకోలేక తల్లి మరణం

కడప,మే4(జ‌నంసాక్షి):  తాగునీటి విషయంలో జరిగిన ఘర్షణ తల్లీకొడుకుల ప్రాణాలు బలిగొంది. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి కూడా తనువు చాలించింది. కడప జిల్లాలోని రాజంపేటలో తాగునీటి విషయంలో ఘర్షణలో జరిగింది. ఈ ఘర్షణలో పబ్బర్తి బాలాజీ(39) తీవ్రంగా గాయపడి.. తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొడుకు మృతిని తట్టుకోలేక మనస్తాపంతో తల్లి భాగ్యమ్మ(65) కూడా మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తండ్రిని చంపిన తనయుడు తల్లిని తరచూ వేధిస్తున్నాడనే ఉక్రోషం పట్టలేక తండ్రిని రోకలిబండతో కొట్టి చంపాడో తనయుడు. ఈ ఘటన పాత గుంటూరులో చోటు చేసుకుంది. సాంబయ్య అనే వ్యక్తి ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి భార్యను వేధిస్తున్నాడు. దీంతో కొడుకు భరించలేకపోయాడు. ఎప్పటిలాగే మద్యం సేవించి వచ్చి సాంబయ్య తన తల్లిని వేధించడాన్ని కొడుకు కిశోర్‌ సహించలేకపోయాడు. రోకలిబండతో తండ్రిని కొట్టి చంపేశాడు.