తాటి చెట్టు పై నుండి పడి మరణించిన గీత కార్మికుడి మృతదేహానికి నివాళులు అర్పించిన బీర్ల అయిలయ్య

ఆత్మకూర్ (ఎం)అక్టోబర్ 7 (జనంసాక్షి) పారుపల్లి గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు అతికెం శ్రీనివాస్ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాదవశాత్తు తాటిచెట్టు పై నుండి కింద పడి మరణించడం జరిగింది వారి మృతదేహానికి బీర్లా ఫౌండేషన్ చైర్మన్ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పిసిసి మెంబర్ బీర్ల అయిలయ్య పులమాలలు వేసి నివాళలర్పించారు అలాగే పత్తురి భద్రయ్య ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు మరియు ఆక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్లిన దొంతరబోయిన వెంకటేష్ ని కలిసి ఆర్థిక సహాయం చెయ్యడం జరిగింది ఈ సందర్భంగా అయిలయ్య మాట్లాడుతూ మరణించిన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ తరుపున ఆదుకుంటాం అని వారి కుటుంబానికి ఎల్లవేళల అండగా ఉంటాం అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు జన్నయికొడే నగేష్ స్థానిక ఎంపీటీసీ బండ హంసయ్య ఓబీసీ అధ్యక్షుడు బత్తిని ఉప్పలయ్య ఎస్సి సెల్ ఏనుతుల నగేష్ గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కోమిరెల్లి నాయకులు పాపయ్య తదితరులు పాల్గొన్నారు