తిరుపతి ఆర్డీవోగా కనక నర్సారెడ్డి బాధ్యతల స్వీకరణ

తిరుపతి,జూలై22(జ‌నంసాక్షి): తిరుపతి రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా కనక నర్సారెడ్డి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈయన స్థానంలో ఉన్న సబ్‌ కలెక్టర్‌ డా.మహేశ్‌కుమార్‌ రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు. చిత్తూరు ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న కనకనర్సారెడ్డిని తిరుపతి ఆర్డీవోగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన తిరుపతి ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తిరుపతి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఆయా మండలాల తహసీల్దార్‌లు, రెవెన్యూ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలను అందిజేసి శుభాకాంక్షలు తెలిపారు.