తిరుపతి రైల్వేస్టేషన్‌ అభివృద్ధి

తిరుపతి : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ తరహాలో తిరుపతి స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్‌ బాపిరాజు, ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రైల్వే అధికారి తేజ్‌పాల్‌ సింగ్‌ చెప్పారు. టీటీడీకి చెందిన గోవిందరాజుస్వామి సత్రాల్లో 2,3వ సత్రాలను రైల్వేస్టేషన్‌ అభివృద్దికి వినియోగిస్తామన్నారు. సత్రాల నుంచి భక్తుల కోసం విష్ణు నివాసం వరకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పారు.