తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

నిండిపోయిన కంపార్టుమెంట్లు
తిరుమల,మే3(జ‌నంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల కారణంగా భక్తుల రాక పెరిగింది. దీంతో  స్వామి వారిని దర్శించుకునే భక్తులతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో భక్తులు కంపార్ట్‌మెంట్ల వెలుపల వరకు క్యూ కట్టారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నడకదారి గుండా వచ్చే భక్తులకు, టైం స్లాట్‌ టోకెన్‌ దర్శనానికి, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ కారణంగా అన్ని రకాల క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లతో పాటు ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది. భక్తులకు మజ్జిగా తదితర పానీయాలను సరఫరా చేస్తున్నారు.