తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ నేతలు
తిరుమల,ఏప్రిల్20(జనంసాక్షి): తిరుమల శ్రీవారిని పలువురు తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సురేంద్ర, వికారాబాద్ ఎమ్మెల్యే ఎం ఆనంద్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా…. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత స్వామి వారి దర్శనార్థం తిరుమలకు వచ్చానని కొప్పుల ఈశ్వర్ తెలిపారు.