తిరువూరులో స్పందన కార్యక్రమం

విజయవాడ,జూలై22 (జ‌నంసాక్షి): కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలోని ఆర్య వైశ్య కల్యాణ మండపంలో సోమవారం ‘ స్పందన ‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రతిష్టాత్మకంగా ఈ  కార్యక్రమాన్ని చేపట్టినట్లు కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాధవి లత పేర్కొన్నారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాధవి లత, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ అనుపమ, జిల్లా స్థాయి
అధికారులు పాల్గన్నారు.