తుర్కపల్లి మండలంలో కేంద్రంలో జె. యమ్.ఫంక్షన్ హాలులో బిజెపిలోకి భారీ చేరిక

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనంసాక్షి) న్యూస్ 08/అక్టోoబరు /22//
 తుర్కపల్లి మండలంలో కేంద్రంలో జె.  యమ్.ఫంక్షన్ హాలులో  బిజెపిలోకి భారీ చేరిక   కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న దృశ్యం
తుర్కపల్లి మండలంలోని తుర్కపల్లి దయ్యం బండ తండ, కొండాపురం, వాసాలమర్రి ,శ్రీనివాసపురం, ములకలపల్లి , జెతిరామ్ తండా, సంగ్యా తండ, రాంపూర్ తండాల నుండి సుమారు 500 మంది బిజెపి పార్టీలోకి ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బిజెపి రాష్ట్ర నాయకులు పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీలోకి శనివారం చేరారు. ఈ సందర్భంగా పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని అన్నారు ఎలక్షన్లు వస్తేనే అనేక బంధులు తెస్తున్న బిఆర్ఎస్ పార్టీ కి రాబోవు ఎన్నికల్లో ఎదుర్దెబ్బ తగులుతుందని అన్నారు. ప్రజలు చైతన్య వంతులు  అయినారని అన్ని విషయాలు గ్రహిస్తున్నారని అన్నారు. కుటుంబ పాలన విముక్తి చేయడానికి బిజెపి తెలంగాణలో అడుగుపెట్టినదని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలల్లో బి. ఆర్.ఎస్ .ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఆదాయంలో ఉన్న రాష్ట్రాన్ని అఫలమయంగా మార్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొక్కొండ లక్ష్మీనారాయణ గౌడ్, సర్పంచ్ పడాల వనిత శ్రీనివాస్ ,మాజీ ఎంపీపీ బబ్బురి రవీంద్రనాథ్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి డొంకని రాజు గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకుల రమేష్, ఆకుల సైదులు, మేకల శ్రీనివాస్, పెండెం నరసింహులు, ఏషాబోయిన రాజయ్య, ఏడుమూల ఆంజనేయులు ,నరసింహ యాదవ్, నరేందర్ నాయక్, శత్రు నాయక్, రేకల రమేష్ యాదవ్, గోనె స్వరూప కృష్ణమూర్తి , కర్రే రాజ్ కుమార్ గౌడ్ ,జక్కుల వెంకటేశ్ యాదవ్, భాస్కర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area