తుల్జాపూర్ కు పాదయాత్రగా బయల్దేరిన బర్దిపూర్ శ్రీ తుల్జా భవాని భక్తులు…

ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన శ్రీ భవాని మాత భక్తులు 14 మందితో భక్తులతో కూడిన బృందం బర్దిపూర్ గ్రామంలోని శ్రీ హనుమాన్ మందిర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రగా బయల్దేరారు. బర్దిపూర్ నుండి జహీరాబాద్, మన్నె కెళ్లి, మీదుగా హు స్నాబాద్ చేరుకుంది. ఐదు రోజుల పాటు కొనసాగిన పాదయాత్ర సుమారు 250 కిలోమీటర్లు సాగనుంది. పౌర్ణమి రోజు బర్దిపూర్ భవాని భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది.
ఈ పాదయాత్రలో కోట రాజు, బాల్కీ దిగంబర్, ఆవుటి గల్లప్ప, కుమ్మరి సంగమేశ్వర్, వడ్ల నాగ మూర్తి, కోట నరసింహులు, బస్వరాజ్ స్వామి, కోట దత్తు, కమ్మరి దత్తు, దశరథ్, తదితరులు పాల్గొన్నారు.