తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న ఆందోళన
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట మండలంలో కేపీఆర్ సంస్థ అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా రెండు గ్రామాల ప్రజలు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. గ్రామస్థుల ఆందోళనలో పొక్లెయిన్ డ్రైవర్ గాయపడ్డాడు. గ్రామస్థులు పొక్లెయిన్ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ డ్రైవర్ని ఆసుపత్రికి తరలించారు.