తృతీయ కూటమి అనుమానమే: సురవరం

నల్గొండ: వచ్చే ఎన్నికలకు ముందు తృతీయ కూటమి అనుమానమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. మైనార్టీలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదన్న ఆయన , 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, భాజపాయేతర పార్టీలే అధికారంలోకి వస్తాయని పేర్కొన్నారు.