తెదేపా, కాంగ్రెస్‌ కార్యకర్తల ఘర్షణ

ఖమ్మం: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దుల పల్లిలో కాంగ్రెస్‌, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పంట నష్ట పరిహారం పంపీణీ విషయంలో జరిగిన ఈ ఘర్షణలో నలుగురు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.