తెరాసా పాలనలో పామాయిలు రైతులకు ఇబ్బందులు

అశ్వరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నకేశవరావు
అశ్వారావుపేట, అక్టోబర్ 8 (జనంసాక్షి)తెరాస పాలనలోనే పమాయిలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొగుళ్ళపు చె న్నకేశవరావు అన్నారు. శనివారం అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి చెన్నకేశవరావు మాట్లాడుతూ..స్థానిక పామాయిలు కర్మాగారం సామర్థ్యం పెంచకపోవడం వల్లే రైతులు ఇబ్బందులకు గురవుతున్నారనిఆయన అన్నారు. పామాయిల్ గెలలతో వాహనాలు రోడ్డుమీద ఆగి దిగుమతి చేయటంలో గంటల తరబడి ఉండటంతో రైతులు అసహానికి గురవుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సౌకర్యాల కల్పనలో విఫలమైందని ఆయన తెలిపారు. కొంతమంది అధికార పార్టీకి చెందిన నాయకులు పామాయిల్ రైతు కమిటీల పేరుతో అన్ని వర్గాల రైతులకు అన్యాయం జరుగుతుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నకేశవరావు విమర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి అంకత మల్లికార్జున రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బూసి పాండు, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు తుమ్మ రాంబాబు, సుంకవల్లి వీరభద్రరావు, జల్లిపల్లి దేవరాజు, బండారు మహేష్, తదితరులు పాల్గొన్నారు.