తెరాస పార్టీ సీనియర్ కార్యకర్త రోషన్ కుటుంబాన్ని పరామర్శించి ఎమ్మెల్యే

మల్దకల్ ఆగస్టు 29 (జనంసాక్షి)గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలంలో ఎల్కుర్ గ్రామానికి చెందిన తెరాస పార్టీ సీనియర్ కార్యకర్త రోషన్ అనారోగ్యంతో బాధపడుతున్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.సోమవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి ఇంటికి వెళ్లి రోషన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని ఓదార్చడం ఆర్థిక సహాయం అందజేశారు.
అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే వెంటనే వైస్ ఎంపీపీ వీరన్న, మల్డకల్ మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, మండలం పార్టీ అధ్యక్షుడు వెంకటన్న, మండల కో ఆప్షన్ నెంబర్ తెరాస పార్టీ నాయకులు అజయ్, చక్రధర్ రెడ్డి, నరసింహారెడ్డి, ఆంజనేయులు, భాస్కర్, నారాయణ,మధు, ప్రవీణ్, మహేష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.