తెరుచుకున్న అయ్యప్ప సన్నిధి

భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు

తిరువనంతపురం,నవంబర్‌5(జ‌నంసాక్షి): భారీ బందోబస్తు మధ్య, గత అనుభవాన్‌ఇన దృష్టిలో పెట్టుకుని నెలవారి పూజలో భాగంగా సోమవారం సాయంత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని తెరిచారు. చిత్తిర పూజ సందర్భంగా.. అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో దర్శనం కోసం వచ్చారు. మంగళవారం సాయంత్రం మళ్లీ ఆలయాన్ని మూసివేయనున్నారు. కేవలం రెండురోఉల పూజకోసం మా/-తరమే తెరిచారు. అయితే 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళా భక్తులు ఎవరూ అయ్యప్ప స్వామి దర్శనం కోసం రాలేదని తెలుస్తోంది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో .. కొందరు ఆందోళనకారులు మహిళలను అడ్డుకున్నారు. గత నెలలో కొందరు మహిళలు ఆలయ ప్రవేశం కోసం ప్రయత్నించినా.. వారిని ఆందోళనకారులు తిప్పికొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు రోజుల పూజ కోసం ఆలయాన్ని తెరిచారు. ఈ సందర్భంగా 50 ఏళ్ల వయసు దాటిన 15 మంది మహిళా పోలీసులను కూడా శబరిమలలో భద్రత కోసం ఉంచారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.