తెలంగాణకు ఏమిటి.. కేంద్రంపై ఒత్తిడి పెంచనున్న కేసీఆర్ సర్కారు

 

lyu82cvhబిహార్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం తెలంగాణ ప్రభుత్వంలోనూ సరికొత్త ఆశలకు తెర తీసింది. తమది కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రమేనని, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమకూ ప్రత్యేకంగా ప్యాకేజీ, రాయితీలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చాలా రోజులుగా కోరుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలనూ అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర మంత్రులు సైతం తరచూ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు సైతం ప్యాకేజీ సాధించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఏయే రంగాల్లో ఎన్నెన్ని నిధులు అవసరం.. ఎక్కడెక్కడ కేంద్ర సాయాన్ని తాము కోరుతున్నదీ వివరిస్తూ ప్రత్యేక నివేదికలు సిద్ధం చేసే పనిని మొదలెడుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరి కేంద్రం తెలంగాణను ఏ మేరకు ఆదుకుంటుందో? ఎంత ప్యాకేజీ ప్రకటిస్తుందో వేచిచూడాలి.