తెలంగాణపై స్పష్టత ఇస్తా..

వచ్చే నెల రెండో వారంలో ప్రకటిస్తా
ఎట్టకేలకు తెలంగాణపై అయోమయంలో
ఉన్నామని ఒప్పుకున్న బాబు
హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) :
తెలంగాణపై త్వరలోనే స్పష్టత ఇస్తానని, వచ్చే నెల మొదటి వారంలో స్పష్టత ఇస్తానని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం జరిగిన పొలిట్‌ బ్యూరో సమావేశంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టత ఇస్తారని భావించిన ఆ పార్టీ తెలంగాణ నాయకులకు బాబు నిరాశపర్యారు. ఎట్టకేలకు తాము తెలంగాణపై ప్రకటన చేయడంపై అయోమయంలో ఉన్నట్లు బాబు వెల్లడించారు. దీంతో తెలంగాణవాదులు తమ నిర్లక్ష్య వైఖరి వల్లనే తెలంగాణ ఏర్పాటు ఆలస్యమైందని, పరోక్షంగా తెలంగాణ యువకుల ఆత్మహత్యలకు కారణమైనట్లు చెప్పకనే చెప్పారని ఎద్దేవా చేశారు. బాబు మాత్రం ఇది చాలా సున్నిత విషయమని, అందుకే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నమని వివరించారు.