తెలంగాణలో బిజెపి అధికారమే లక్ష్యంగా,ప్రతి ఒక్కరు ఒక సైనికుడిల పని చేయాలి…. బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్

కోటగిరి జూలై 27 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మండల బీజేపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ కార్యాలయాని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లడుతూ.
రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి అంటే ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలి.బిజెపి కార్యకర్తలను అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెడతార అని టి.అర్.ఎస్ ప్రభుత్వాన్ని  హెచ్చరించారు.పక్క నియోజకవర్గంలో ఐఎస్ఐ ఏజెంట్లు దొరుకుతున్నారు.కానీ ఇక్కడి బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఐ.ఎస్.ఐ ఏజెంట్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు.చత్రపతి శివాజీ మహారాజ్ లేకపోతే ఈరోజు మన దేశంలో హిందువులు ఉండేవారు కాదు.అలాంటి  చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం బోధన్ లో పెట్టడానికి వెళ్లిన 12 మంది కార్యకర్తలపై కేసు పెట్టి జైలుకు పంపించడం సిగ్గుచేటన్నారు.ఈ కార్యక్రమంలో నిజాంబాద్ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్యాద్రి రెడ్డి, మండల్ ప్రెసిడెంట్ గాండ్ల శ్రీనీవాస్,సెక్రెటరీ ఎముల నవీన్,బజరంగ్, నాయకులు గురునాథ్,సతీష్ మహారాజ్,రాజా గౌడ్,శివచరన్,మామిడి శ్రీనివాస్, రాజు,తదితరులు పాల్గొన్నారు.
Attachments area