తెలంగాణ ఉద్యమ డైరీ ఆవిష్కరణ

3

హైదరాబాద్‌,సెప్టెంబర్‌19(జనంసాక్షి):పిట్టల రవిందం రచించిన తెలంగాణ ఉద్యమ డైర్ణీ పుస్తకావిష్కరణ జరిగింది.  సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్‌ అకాడవిూ ఛైర్మన్‌ అల్లం నారాయణ, తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసం కోదండరాం, టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి, టీఎస్‌పీఎస్‌సీ సభ్యుడు విఠల్‌ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉద్యమ చరిత్రను తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగ పడుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనులు పాల్గొన్నారని ప్రొఫెసం కోదండరాం తెలిపారు. ఉద్యమం సందర్భంగా చోటుచేసుకున్న అనేక సంఘటనలను రికార్డు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. చరిత్రను సృష్టించిందే తెలంగాణ వాళ్లు అని అన్నారు. మన చరిత్రను మనమే రాసుకునే అవకాశం వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమానికున్న ప్రామాణికత ఉద్యమ డైరీలో తెలుస్తుందన్నారు. ఉద్యమంలో ఉద్యోగులు నిర్వహించిన పాత్రను రవీందం వివరించారని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రకు ప్రామాణికత ఎక్కడా అని అడుగుతున్నారని, కానీ చరిత్రకు ప్రామాణికత అవసరంలేదని వివరించారు. ఉద్యమంలో పాల్గొన్న వారే ఇవాళ తెలంగాణ చరిత్రను రాస్తున్నారని వివరించారు.