తెలంగాణ కార్మిక సమైక్య సభను విజయవంతం చేయాలి తెలంగాణ కార్మిక సమైక్య సభను విజయవంతం చేయాలి 

పెద్దవంగర డిసెంబర్ 13(జనం సాక్షి )తెలంగాణ కార్మిక సమైక్య సభను  విజయవంతం చేయాలని ఆ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చింతల యాకన్నా , బీఎస్పీ మండల కన్వీనర్ రాంపాక కిరణ్ లు పిలుపునిచ్చారు.  మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చోరస్తాలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 28 వ  తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ కార్మిక సమైక్య సంఘము ఆధ్వర్యంలో  తోర్రుర్ డివిజన్ కేంద్రంలో జరిగే బహిరంగ సదస్సు  జరుగుతుందని,  కార్మికుల హక్కులు, సమస్యలపై కార్మికులందరూ ఏకమై  ప్రతి యొక్క కార్మికులు వచ్చి సభను  విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంపత్, శ్రీకాంత్, ఐలయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.