తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం

వేమనపల్లి,అక్టోబర్ 07,(జనంసాక్షి)

వేమనపల్లి మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నీల్వాయి శాఖ ఆధ్వర్యంలో కేతనపల్లి గ్రామ పంచాయతీలో కళాజాత బృందంచే ఆర్థిక అక్షరాస్యత సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ శివ శంకర్ మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్,నాబార్డ్ బ్యాంక్ వారి సహకారంతో కళాజాత బృందం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.బ్యాంక్ సేవలు, ఇన్సూరెన్స్, గోల్డ్ లోన్, డిజిటల్ సేవలు, క్రాఫ్ లోన్ వివిధ పథకాలను ఖాతాదారులు వినియోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆవులమారి దుర్గక్క,ఫీల్డ్ ఆఫీసర్ సాగర్,క్యాషియర్ సందీప్,బ్యాంక్ సిబ్బంది పొచన్న, పున్నం చంద్, మహిళా సంఘాల సభ్యులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.