తెలంగాణ డీజీపీగా ఏకే ఖాన్‌ ?

1

– బరిలో ఐదుగురు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌21(జనంసాక్షి):

తెలంగాణకు పూర్తిస్థాయి డిజిపి నిమామకం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త డీజీపీ నియామకం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. డీజీపీ నియామకానికి సంబంధించి ఐదుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను సిఫార్సు చేస్తూ వారి పేర్లను సోమవారం యూపీఎస్సీకి పంపించింది. జాబితాలో అనురాగ్‌శర్మ, అరుణా బహుగుణ, దుర్గాప్రసాద్‌, ఏకే ఖాన్‌, తేజ్‌దీప్‌ కౌర్‌ పేర్లు ఉన్నాయి.  ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ, నేషనల్‌ పోలీస్‌ అకాడవిూ డీజీ అరుణ బహుగుణ, సీఆర్పీఎఫ్‌ డీజీ దుర్గాప్రసాద్‌, ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌, ఎస్పీఎఫ్‌ డీజీ తేజ్‌దీప్‌ కౌర్‌ పేర్లను ప్రభుత్వం పంపింది. ఇందులో మళ్లీ అనురాగ్‌ శర్మకే అధికా ప్రాధాన్యం ఉందని, లేకుంటే ఎకె ఖాన్‌కు అవకాశం రావచ్చని అంటున్నారు.